కొత్తగూడెం :ఆగస్ట్ 1..(పున్నమి ప్రతినిధి )::
భద్రాద్రికొత్తగూడెం జిల్లా రామవరం లోని ఎకలవ్య మోడల్ రెసీడెన్షియల్ పాఠశాలలో ఒక విద్యార్థి పై ఉపాధ్యాయుడు దాడి చేసాడనే ఆరోపణలు వచ్చాయి.ఎడో తరగతి చదువుతున్న భూక్యా థమన్ తేజ్ అనే విద్యార్థిని తెలుగు ఉపాధ్యాయుడు రాజేందరరెడ్డి చితక బాధి నట్లు విద్యార్థి తల్లి తండ్రులు ఆరోపించారు.ఉపాధ్యాయుడు అకారణంగా తమ కుమారుడిపై దాడి చేసాడని ఈ ఘటనలో విద్యార్థికి తీవ్ర గాయాలు అయ్యాయని ఆరోపించారు.నిందితుడైనా రాజేందర్ రెడ్డి పై కఠిన చర్యలు తీసుకోవాలి అని కోరుతూ వారు టు టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు.ఈ ఘటనపై పోలీస్ లు ఫిర్యాదు స్వీకరించి దర్యాప్తు చేపట్టారు.అలాగే పాఠశాల యాజమాన్యం కూడా ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్టు సమాచారం




