నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ. నందన్ శనివారం నగర పర్యటనలో భాగంగా ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి, రాయపుపాలెం రోడ్డు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను పరిశీలించారు. అనంతరం మినీ బైపాస్ అన్నమయ్య కూడలి సమీపంలోని ఎన్టీఆర్ పార్కు ఖాళీ స్థలాన్ని సందర్శించి అభివృద్ధి చర్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఈఈ అనిల్కుమార్, శానిటేషన్, టౌన్ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




