*జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం పనులను పరవేక్షించిన డిఎస్ఓ. ఏ. ఉదయభాస్కర్*
అమలాపురం జూలై 28
జిల్లా వినియోగదారుల సమాఖ్య సభ్యులు కోరిక మేరకు అమలాపురంఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు, జిల్లా కలెక్టర్ రవిరాళ మహేష్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ వైకోమ్ నీదియా దేవి , డీ.ఎస్.ఓ .ఏ. ఉదయభాస్కర్ మరియు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ కృషి ఫలితంగా వినియోగదారుల సమాచార కార్యాలయాన్ని అమలాపురం భూపయ్య అగ్రహారంలోనిమున్సిపల్ పిల్లలపార్క్ ఆవరణలో కోనసీమ మహిళా మండలి భవన సమీపంలో కార్యాలయాన్ని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా కోకో ఫెడ్ చైర్మన్, రాష్ట్ర విజిలెన్స్ కమిటీ సభ్యులు అరిగెల బలరా మూర్తి కోకోపేడ్ సభ్యులు పై అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
డి.ఎస్.ఓ ఉదయభాస్కర్ పర్యవేక్షణలో ఈరోజు భవన కార్యాలయ మరమ్మతులు పర్యవేక్షణ సభ్యులు సమక్షంలో చూసి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అనునిత్యం ఈ కార్యాలయం నందు సభ్యులు అందుబాటులో ఉండి వినియోగదారులకు సేవలు అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి డిఎస్ఓ ఏ. ఉదయ భాస్కర్, అరిగెల బలరామమూర్తి, డిసిఐసి సభ్యులు డాక్టర్ బి వివి సత్యనారాయణ,అద్దంకి అమరేశ్వర రావు, సాహితీ వేత్త నల్లా నరసింహమూర్తి, ఎన్. నాగభూషణం, జానీ పాషా, అయ్యప్ప స్వామి, మెళ్ల శాస్త్రులు ప్రభుతులు పాల్గొన్నారు.


