బెల్లంపల్లి పున్నమి న్యూస్ల్ జూలై 21: ఢిల్లీ జంతర్మంతర్ వద్ద విద్యార్థులు, యువకులపై జరిగిన లాఠీచార్జ్ను MCPIU పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, వారితో చర్చలు జరపాలని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో MCPIU బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, ఆరెపల్లి సతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

ఢిల్లీ లాఠీచార్జ్ను ఖండించిన MCPIU
బెల్లంపల్లి పున్నమి న్యూస్ల్ జూలై 21: ఢిల్లీ జంతర్మంతర్ వద్ద విద్యార్థులు, యువకులపై జరిగిన లాఠీచార్జ్ను MCPIU పార్టీ మంచిర్యాల జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. విద్యార్థుల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, వారితో చర్చలు జరపాలని పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. విద్యార్థులపై దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో MCPIU బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి ఆరెపల్లి రమేష్, ఆరెపల్లి సతీష్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

