మట్టపర్రు, జూలై 19 (రమేష్ నాయుడు – పున్నమి ప్రతినిధి): అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా నియమితులైన సందర్భంగా యువనేత నల్లమిల్లి మనోజ్ రెడ్డి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని మట్టపర్రులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచి పార్టీ బాధ్యతలు అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి, నాయకత్వానికి మంత్రి ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.
అనపర్తి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, కార్యకర్తలతో సమన్వయంగా పనిచేసి పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నల్లమిల్లి మనోజ్ రెడ్డి పేర్కొన్నారు.



