కాశీపురం లో సామూహిక అక్షరాభ్యాసం
అంగనవాడి కేంద్రం చిన్నారులతో పలకలు
బలపాలు పంపిణీ
హోమియో మందుల పంపిణీ
పున్నమి న్యూస్ వాకాడు హరికృష్ణ జులై 13
తిరుపతి జిల్లా వాకాడు మండలం కాశిపురం దళితవాడలోని అంగనవాడి కేంద్రం వద్ద సోమవారం నెల్లూరు జిల్లా కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన విద్యా ప్రాధాత స్వర్గీయ ముప్పవరపు వెంకటేశ్వరరావు శ్రీమతి ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకార్థం
ఎం వి రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాశీపురం లోనే అంగనవాడి కేంద్రం చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా అంగనవాడి కేంద్రంలోనే చిన్నారులకు అవసరమైన పలకలో బలపాలను ఏవే రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పంపిణీ చేశారు.
తదుపరి వారిచే హిందూ సంప్రదాయానికి అనుగుణంగా సామూహిక అక్షర వ్యాసం కార్యక్రమం నిర్వహించారు.
తదుపరి గ్రామస్తులకు అంగనవాడి కేంద్రం చిన్నారులకు చికెన్ ఫాక్స్ అమ్మవారు సోకకుండా అవసరమైన ముందస్తు హోమియో మందులను ఫౌండేషన్ నిర్వాహకులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ, కార్యదర్శి ఎం విజయలక్ష్మి అంగన్వాడి కేంద్ర నిర్వాహకులు ఝాన్సీ నేలమ్మ గీత గ్రామస్తులు పాల్గొన్నారు.




2 Comments
D. శ్రీధర్ బాబు
July 13, 2026రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. వ్యక్తి మృతి. గడివేముల మండల పరిధిలోని కరిమద్దెల గ్రామ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఒకరు మృతి చెందగా,ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. నంద్యాల పట్టణం విశ్వనగర్ కు చెందిన కరీం,శ్రీనివాసులు పడమటూరు గ్రామం నుండి ద్విచక్రవాహనంపై నంద్యాలకు వెళుతుండగా,కరిమద్దెల గ్రామానికి చెందిన నాగ కిషోర్ తన పొలం పనుల నిమిత్తం ద్విచక్రవాహనంపై వెళుతూ ఆంజనేయ స్వామి గుడి సమీపంలో రెండు బైక్లు ఢీకొనడంతో కరీం అక్కడికక్కడే మరణించగా,శ్రీనివాసులుకు కాలు విరుగగా, నాగ కిషోర్ కు తీవ్రగాయాలు కావడంతో వీరిని 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
D. శ్రీధర్ బాబు
July 13, 2026చనిపోవడం దురదృష్టం.. కన్నవారికి కడుపుకొత