కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా( పున్నమి ప్రతినిధి ) జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అన్నారు. ఈ పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు, వైస్ చైర్మన్ అహ్మద్ గారు, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్ గారు, కౌన్సిలర్లు సలాం గారు, నాగుబాయి గారు, పార్టీ నాయకులు, అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా( పున్నమి ప్రతినిధి ) జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో గౌరవ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే శ్రీమతి కోవ లక్ష్మి గారు 80 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఉపయోగకరంగా నిలుస్తోందని అన్నారు. ఈ పథకం ద్వారా వేలాది నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ మెంగ్రే ఆకాష్ గారు, వైస్ చైర్మన్ అహ్మద్ గారు, సింగిల్ విండో చైర్మన్ అలీ భాయ్ గారు, కౌన్సిలర్లు సలాం గారు, నాగుబాయి గారు, పార్టీ నాయకులు, అధికారులు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

