పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని 27,958 మంది రైతులకు రూ.18.50 కోట్లు జమయ్యాయని తెలిపారు. ఈ విడతలో రైతులకు పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు అందుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొచ్చిందని, రైతు సంక్షేమం కోసం యాంత్రీకరణ, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల సరఫరా, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

శీర్షిక: సర్వేపల్లి రైతులకు రూ.18.50 కోట్లు.. అన్నదాత సుఖీభవతో రెట్టింపు సాయం: సోమిరెడ్డి
పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని 27,958 మంది రైతులకు రూ.18.50 కోట్లు జమయ్యాయని తెలిపారు. ఈ విడతలో రైతులకు పీఎం కిసాన్ కింద రూ.2 వేలు, అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు అందుతున్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం వ్యవసాయానికి పూర్వవైభవం తీసుకొచ్చిందని, రైతు సంక్షేమం కోసం యాంత్రీకరణ, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల సరఫరా, సంక్షేమ పథకాలను సమర్థంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

