దుత్తలూరు గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాయకులు, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి దంపతులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భూమిపూజ, వాస్తు శాంతి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ నిర్మాణం భక్తుల చిరకాల ఆకాంక్ష అని, ఆలయం పూర్తయిన తర్వాత దుత్తలూరు ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

దుత్తలూరులో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన
దుత్తలూరు గ్రామంలో శ్రీ సీతారాముల ఆలయ నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాయకులు, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి దంపతులతో కలిసి వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ భూమిపూజ, వాస్తు శాంతి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ నిర్మాణం భక్తుల చిరకాల ఆకాంక్ష అని, ఆలయం పూర్తయిన తర్వాత దుత్తలూరు ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

