*ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం కాబోతున్నాయి*
*ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ఏకగ్రీవంగా ముగియనుంది. అధికార కూటమికి అసెంబ్లీలో స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులు, జనసేన పార్టీకి చెందిన ఒక అభ్యర్థి పోటీ లేకుండానే రాజ్యసభకు ఎన్నిక కానున్నారు*
*తెలుగుదేశం పార్టీ తరఫున సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్లను అభ్యర్థులుగా ప్రకటించగా, జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేష్ బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఇతర పార్టీల నుంచి ఎవరూ పోటీలో లేకపోవడంతో ఈ నలుగురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పష్టమైంది.*
*2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించడంతో రాజ్యసభ స్థానాలన్నింటినీ కైవసం చేసుకునే స్థాయిలో సంఖ్యాబలం లభించింది*
*టీడీపీకి మూడు స్థానాలు, మిత్రపక్షమైన జనసేనకు ఒక స్థానం కేటాయించారు. జనసేన పార్టీకి రాజ్యసభలో ఇదే తొలి ప్రాతినిధ్యం కావడం విశేషం*


