*బడిబాటలో భాగంగా బడిబాటపై ప్రభుత్వ పాఠశాలల బలోపేతం గురించి గౌరవ కలెక్టర్ గారిచే సిడి ఆవిష్కరణ*
*పున్నమి ప్రతినిధి 29/05/ 2026*
*మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న వనరులు, నాణ్యత విద్యార్థుల నమోదు విద్యా ప్రమాణాలు, సౌకర్యాలు నాణ్యమైన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య జీవన నైపుణ్యాలతో కూడిన విద్య స్పోర్ట్స్ గేమ్స్ వ్యాయామము యోగ తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అన్నింటినీ తెలియజేసే బడిబాట ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను తెలియజేసే సిడి ఆవిష్కరణ ఈరోజు కలెక్టర్ శ్రీమతి ఖుష్బూ గుప్తా గారిచే మరియు అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ మరియు జిల్లా విద్యాధికారి మరియు గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి మురళీకృష్ణ గారు, అలాగే ఈ పాటను రచించిన రచన చేసినటువంటి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు తిరుమల నాగేంద్ర కుమార్ మరియు రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ సహకారంతో ఆవిష్కరణ జరిగింది, ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల గురించి విద్యార్థుల కలల గురించి అద్భుతంగా ఎంతో అద్భుతంగా పాడిన రచన చేసిన ఈ పాట ప్రతి పాఠశాలలో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు తెలియజేస్తూ గురువులు విద్యార్థులు ముందుకు తీసుకెళ్లి విద్యార్థులు నమోదును వేగవంతం చేయాలి మరియు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆమె తెలియజేశారు, రచన చేసిన రచయితను తిరుమల నాగేంద్ర కుమార్ ను అభినందించారు*

