మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని హనుమన్ బస్తీ, 33వ వార్డులో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (సర్) ముమ్మరంగా కొనసాగుతుంది. గురువారం స్థానిక ఆదర్శ గ్రంధాలయం వద్ద కొనసాగుతున్న సర్ కార్యక్రమాన్ని బెల్లంపల్లి పట్టణంలోని 10 బూత్ ల ఇన్చార్జి, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి రాము పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల ఎన్యూమరేషన్ ఫారం లు నింపారు. ఈ సందర్భంగా బండి రాము మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారం బీఎల్ఓ కు అప్పగించాల్సిన సమయం దగ్గర పడుతున్నందున ప్రతి ఒక్కరు తమకు పంపిణీ చేసిన ఫారం లు నింపి బిఎల్ఓ లకు అందించాలని అన్నారు. ఎవరికైనా సందేహాలు ఉంటే వార్డ్ లో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ వద్దకు వచ్చి బీఎల్ఓ, బీఎల్ఏ సహాయంతో ఫారంలు నింపి అందజేయాలని సూచించారు. వార్డ్ లోని అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించబడకుండా జాగ్రత్త పడాలన్నారు. కార్యక్రమంలో వార్డ్ బీఎల్ఓ పద్మావతి, ఆర్పీ నామసాని అరుణ, బిఎల్ఏలు గోడిసేల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు



