రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్మిల్లు వ్యర్థాలు కలిసే ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పర్యాటక మంత్రి దుర్గేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర ఘాట్లను కేవలం అలంకరించడం కాదు, ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పేపర్మిల్లు యాజమాన్యం వ్యర్థాలను శుద్ధి చేయకుండా, వేతనాల పెంపు అడిగినందుకు లాకౌట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తోందని మంత్రి చెప్పగా, అక్కడ లోపం ఉండటం వల్లే వారు అలా అంటున్నారని పవన్ పేర్కొన్నారు. ఈ కలుషిత నీరు తాగితే ప్రజలు చనిపోతారని, పరిశ్రమల సమస్యపై కేబినెట్ మంత్రిగా బాధ్యతతో వ్యవహరించాలని, తానే నేరుగా సమాధానం చెప్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

వ్యర్థాల కాలుష్యంపై పవన్ కల్యాణ్ ఆగ్రహం
రాజమహేంద్రవరంలోని ఏపీ పేపర్మిల్లు వ్యర్థాలు కలిసే ప్రాంతాల్లో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, పర్యాటక మంత్రి దుర్గేష్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర ఘాట్లను కేవలం అలంకరించడం కాదు, ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. పేపర్మిల్లు యాజమాన్యం వ్యర్థాలను శుద్ధి చేయకుండా, వేతనాల పెంపు అడిగినందుకు లాకౌట్ చేసి బ్లాక్మెయిల్ చేస్తోందని మంత్రి చెప్పగా, అక్కడ లోపం ఉండటం వల్లే వారు అలా అంటున్నారని పవన్ పేర్కొన్నారు. ఈ కలుషిత నీరు తాగితే ప్రజలు చనిపోతారని, పరిశ్రమల సమస్యపై కేబినెట్ మంత్రిగా బాధ్యతతో వ్యవహరించాలని, తానే నేరుగా సమాధానం చెప్తానని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

