ప్రొద్దుటూరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక 3 టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలోని మార్కెట్ యార్డు గోడౌన్లో 268.571 టన్నుల ఐరన్ మాయమైందని ఆ శాఖ జిల్లా పీడీ రాజారత్నం పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మాయమైన ఐరన్ విలువ రూ.1.70 కోట్లు ఉంటుందని పీడీ తెలిపారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

హౌసింగ్ ఐరన్ మాయంపై కేసు నమోదు: ప్రొద్దుటూరు సీఐ
ప్రొద్దుటూరు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఐరన్ మాయంపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు స్థానిక 3 టౌన్ సీఐ రామాంజనేయుడు తెలిపారు. రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలోని మార్కెట్ యార్డు గోడౌన్లో 268.571 టన్నుల ఐరన్ మాయమైందని ఆ శాఖ జిల్లా పీడీ రాజారత్నం పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. మాయమైన ఐరన్ విలువ రూ.1.70 కోట్లు ఉంటుందని పీడీ తెలిపారు. ఈ మేరకు విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

