Monday, 25 May 2026
  • Home  
  • రోడ్లు గుంతలమయం… చెరువులను తలపిస్తున్న వీధులు
- E-పేపర్

రోడ్లు గుంతలమయం… చెరువులను తలపిస్తున్న వీధులు

రోడ్లు గుంతలమయం… చెరువులను తలపిస్తున్న వీధులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ జనం న్యూస్ ప్రతినిధి 25 మే 2026 రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ పరిధిలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. గ్రామంలోని ప్రధాన వీధులు గుంతలమయంగా మారి చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని పలు కాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండటంతో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. చెత్త, మురుగు నీరు కలిసి దుర్వాసన వెదజల్లుతూ ప్రజలకు ఇబ్బందిగా మారింది. దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు బురద నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వాహనాలు కూడా గ్రామంలోకి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రజలు చెబుతున్నారు. పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులు, సంబంధిత శాఖల అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు గ్రామ సమస్యలను పూర్తిగా విస్మరించారని మండిపడుతున్నారు. వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

రోడ్లు గుంతలమయం… చెరువులను తలపిస్తున్న వీధులు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ

జనం న్యూస్ ప్రతినిధి
25 మే 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్:

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలంలోని మేడిపల్లి నక్కర్త గ్రామపంచాయతీ
పరిధిలో రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. గ్రామంలోని ప్రధాన వీధులు గుంతలమయంగా మారి చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై భారీగా నీరు నిల్వ ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గ్రామంలోని పలు కాలనీల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిని గుంతలు ఏర్పడటంతో వాహనదారులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, విద్యార్థులు, మహిళలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు నిల్వ ఉండటంతో గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతుందని గ్రామస్తులు చెబుతున్నారు. చెత్త, మురుగు నీరు కలిసి దుర్వాసన వెదజల్లుతూ ప్రజలకు ఇబ్బందిగా మారింది. దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాలలకు వెళ్లే చిన్నారులు బురద నీటిలోనే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వాహనాలు కూడా గ్రామంలోకి రావడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రజలు చెబుతున్నారు.
పలుమార్లు గ్రామపంచాయతీ అధికారులు, సంబంధిత శాఖల అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన నాయకులు ఇప్పుడు గ్రామ సమస్యలను పూర్తిగా విస్మరించారని మండిపడుతున్నారు.
వెంటనే రోడ్ల మరమ్మతులు చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.