బిజినేపల్లి మండల పరిధిలోని మంగనూరు గ్రామంలో గత మూడు గంటలుగా కరెంట్ లేకపోవడంతో జనం నరకం చూస్తున్నారు. అకస్మాత్తుగా విద్యుత్ నిలిచిపోవడంతో వంటలు కాక, భోజనాలు చేయలేక ఇల్లాళ్లు అవస్థలు పడ్డారు. ఇళ్లలో ఉక్కపోత భరించలేక చిన్నపిల్లలు రోదిస్తున్నారు. చీకటి పడటంతో ఏం చేయాలో తోచక, కొందరు తమ ద్విచక్ర వాహనాల లైట్ల వెలుతురులోనే రాత్రి పనులను ముగించుకున్నారు. విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి, త్వరగా పనులు పూర్తి చేసి కరెంట్ పునరుద్ధరించాలని గ్రామ పెద్దలు, యువకులు కోరుతున్నారు.
Uploaded Video:

