Monday, 18 May 2026
  • Home  
  • చిట్వేల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో రైతుల ఆగ్రహం
- అన్నమయ్య

చిట్వేల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో రైతుల ఆగ్రహం

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11.20 గంటలు దాటినా ఎంఆర్ఓ కార్యాలయానికి రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల నుంచే ఫిర్యాదుల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి ఎదురుచూసినా సిబ్బంది స్పందించలేదని మండిపడ్డారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది మా రాజ్యం.. మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు” అంటూ రైతులు విమర్శించారు. ప్రజాసేవ కోసం ఉన్న కార్యాలయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అన్నారు.

తిరుపతి జిల్లా చిట్వేల్ మండలం తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఉదయం 11.20 గంటలు దాటినా ఎంఆర్ఓ కార్యాలయానికి రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటల నుంచే ఫిర్యాదుల కోసం వచ్చిన రైతులు గంటల తరబడి ఎదురుచూసినా సిబ్బంది స్పందించలేదని మండిపడ్డారు. ప్రతిరోజూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని, ప్రజల సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. “ఇది మా రాజ్యం.. మేము చెప్పిందే శాసనం అన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు” అంటూ రైతులు విమర్శించారు. ప్రజాసేవ కోసం ఉన్న కార్యాలయాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం దారుణమని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.