పున్నమి ప్రతినిధి, తిరుపతి రూరల్
తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం గ్రామంలో బుధవారం గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి సారెను అందజేశారు. ముందుగా గ్రామం లోని హరిజన వాడలో జరిగిన జాతరకు హర్షిత్ రెడ్డి హాజరు అవగా జాతర గ్రామ పెద్దలు, జాతర నిర్వాహకులు సాదర స్వాగతం పలికి అమ్మ వారి సారె సమర్పించి దర్శనం చేయించారు. అనంతరం ఒడ్డుపల్లి లో జరిగిన జాతరకు హాజరై సారె అందించి అమ్మవారిని దర్శించారు. ఈ సారె సమర్పణలో స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.




