*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు , పెన్షనర్ల న్యాయమైన కోరికలను, దీర్ఘకాలిక అపరిస్కృత డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు*
*పున్నమి ప్రతినిధి మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 17/04/2026*
*తెలంగాణ రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల యొక్క 206 సంఘాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యోగుల గెజిటెడ్ అధికారులు కార్మికులు మరియు పెన్షనర్స్ మెజారిటీ అభిప్రాయాల మేరకు దశల వారి ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఏకమై ఐక్య ఉద్యమాలకు పిలుపునిచ్చారని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎమ్ .ఎన్ విజయకుమార్ డిమాండ్ చేశారు, దీర్ఘకాలిక పెండింగ్ అంశాలు దాదాపు 64 అంశాలు సత్వరమే పరిష్కరింప చేయాలని ఈరోజు మండల జిల్లా కలెక్టరేట్ల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయడం జరిగిందని వారు తెలియజేశారు, పిఆర్సి రిపోర్టును తెప్పించి జూన్ రెండు లోపు అమలు చేయాలని ఇప్పటికే 30 నెలలు పూర్తయి పుణ్యకాలం గడిచిందని వారు తెలియజేశారు, పెండింగ్ బిల్లులు నెలకు సగటున 600 ఉద్యోగులు రిటైర్డ్ అవుతుండటంతో బకాయిలు భారీగా పేరుకుపోయాయని ముఖ్యంగా పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని మానవత్వం దృష్టితో వారికి వచ్చే బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఉద్యోగులు పెన్షనర్లకు వైద్య సేవలు మే ఒకటి నుంచి వైద్య సేవలు అందించాలని అలాగే 2004 కంటే ముందు నియామకమైన ఉద్యోగస్తులు అందరినీ సిపిఎస్ నుంచి ఓపిఎస్ కు మార్చాలని తదితర 64 అంశాలతో దశల వారి ఆందోళన చేపట్టడం జరుగుతుందని ఆయన తెలియజేశారు సత్వరమే ప్రభుత్వం స్పందించి న్యాయమైన దీర్ఘకాలిక అపరిస్కృత సమస్యలను డిమాండ్లను పరిష్కరించాలని కోరారు*


