Friday, 10 April 2026
  • Home  
  • ఉపాధి హామీ పేదల సంజీవని-షర్మిల రెడ్డి పాదయాత్రలో తలపా దామోదరం రెడ్డి
- తిరుపతి

ఉపాధి హామీ పేదల సంజీవని-షర్మిల రెడ్డి పాదయాత్రలో తలపా దామోదరం రెడ్డి

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం హోరెత్తింది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి పాల్గొనగా, ఆమెతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి అడుగువేశారు. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక ‘సంజీవని’ వంటిదని అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన ఈ పథకం వల్లనే పల్లెల్లో పేదల వలసలు ఆగిపోయాయని, అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసా కలిగిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, పథకం కొనసాగింపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు. పేద ప్రజల ప్రయోజనాలే పరమావధిగా షర్మిల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు, వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 10 (పున్నమి న్యూస్) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం హోరెత్తింది. ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల రెడ్డి పాల్గొనగా, ఆమెతో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి అడుగువేశారు. ఈ సందర్భంగా తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక ‘సంజీవని’ వంటిదని అభివర్ణించారు. కాంగ్రెస్ హయాంలో తీసుకువచ్చిన ఈ పథకం వల్లనే పల్లెల్లో పేదల వలసలు ఆగిపోయాయని, అట్టడుగు వర్గాలకు ఆర్థిక భరోసా కలిగిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నీరుగార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, పథకం కొనసాగింపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడబోదని ఆయన హెచ్చరించారు. పేద ప్రజల ప్రయోజనాలే పరమావధిగా షర్మిల రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులు, వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.