మహిళల సాధికారతపై పార్లమెంటరీ కమిటీ ఛైర్పర్సన్ అధ్యక్షతన కీలక సమావేశం లో రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి హాజరు, గ్రామీణ మహిళల అభివృద్ధిపై కీలక చర్చ. మహిళల సాధికారతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా BPCL, HPCL, GAIL, NFL, RCFL, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి ప్రముఖ పబ్లిక్ సెక్టార్ సంస్థలు, బ్యాంకుల ప్రతినిధులతో “CSR కార్యక్రమాల ద్వారా మహిళల సాధికారత”పై విస్తృతంగా సమీక్షించారు.
సంస్థలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులను మహిళల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపుకు వినియోగిస్తున్న విధానాన్ని వివరించాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబనను బలోపేతం చేసే కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.


