పున్నమి న్యూస్ ప్రతినిధి
తెలంగాణ ఇంచార్జ్
07 ఏప్రిల్ 2026
డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం భవనం ప్రారంభోత్సవంలో పాల్గొన్న కళ్లెం నవజీవన్ రెడ్డి
ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి..!
హయత్ నగర్ డివిజన్లోని నూతనంగా నిర్మించిన డిఫెన్స్ కాలనీ సంక్షేమ సంఘం భవనం ప్రారంభోత్సవంలో ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి , హయత్ నగర్ తాజా మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ…
డిఫెన్స్ కాలనీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించిన ఈ భవనం కాలనీ అభివృద్ధికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ సంఘ భవనం ద్వారా కాలనీ ప్రజలకు సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మంచి వేదిక లభిస్తుందని తెలిపారు.
కాలనీ ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా కాలనీ అభివృద్ధికి అవసరమైన ప్రతి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల సహకారం, ఐక్యత ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ కలిసికట్టుగా కాలనీ పురోగతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్షులు గంగాని శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు సురేష్, కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు శ్రవణ్, సోమేశ్వర్ రావు, నర్సింహా, N. శ్రీనివాస్ రెడ్డి, కోటేశ్వర్ రావు, రాఘవేంద్ర రెడ్డి, బాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు..






