శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కోలా ఆనంద్ తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక బిజెపి కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ సూచనల మేరకు ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను ఎగురవేసి, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో జెండా దిమ్మెల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కునాటి నాగరాజ, మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు బాగీతి వెంకటేష్, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నేతలు జీవి అమర్నాథ్, కుప్ప ప్రసాద్, శ్రీపురం సుధాకర్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

మన ఊరు – మన జెండా-శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ శ్రేణులకు కోలా ఆనంద్ పిలుపు
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 03 (పున్నమి న్యూస్): భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6వ తేదీన శ్రీకాళహస్తి నియోజకవర్గవ్యాప్తంగా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ కోలా ఆనంద్ తెలిపారు. శుక్రవారం నాడు స్థానిక బిజెపి కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అధ్యక్షులు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ సూచనల మేరకు ‘మన ఊరు – మన జెండా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోలా ఆనంద్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాను ఎగురవేసి, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలను కోరారు. ఈ మేరకు అన్ని గ్రామాల్లో జెండా దిమ్మెల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు కునాటి నాగరాజ, మహిళా మోర్చా అధ్యక్షురాలు ప్రజ్ఞాశ్రీ, అధికార ప్రతినిధి కొండేటి గోపాల్, మండల అధ్యక్షులు బాగీతి వెంకటేష్, పూజారి ప్రేమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీనియర్ నేతలు జీవి అమర్నాథ్, కుప్ప ప్రసాద్, శ్రీపురం సుధాకర్ సహా పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

