ముస్తాబాద్/ ఏప్రిల్ /పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ళ బాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని బాధిత కుటుంబాలకు సుమారు 40 చెక్కుల గాను మొత్తం రూ.24 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్న పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఇలాంటి ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, ఉపసర్పంచ్ తాళ్ల విజయ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

