విశాఖపట్నం, గాజువాక ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి):
సంక్షేమం,అభివృద్ధి లక్ష్యాలతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు.గాజువాక 86వ వార్డు షకీలా జంక్షన్ వద్ద నల్లూరు సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.ప్రతి నెల 1వ తేదీన అర్హులందరికీ ఎన్టీఆర్ ఆసరా పెన్షన్ క్రమం తప్పకుండా అందజేస్తున్నామని,ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచామని పేర్కొన్నారు.రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో వేగుంట శ్రీనివాస్ రావు,జగదీష్,కొర్లాన రమేష్,నాగార్జున వెంకటేష్,గణపతి,సుబ్బయ్య,కాదా శ్రీనివాస్,గంధం వెంకటరావు,అశోక్,బొబ్బిలి శీను,బాలకృష్ణ,సింహాద్రి,నాయక్ తదితరులు పాల్గొన్నారు.



