ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో గల శ్రీ కృష్ణ చౌదరి హోటల్ యజమాని నల్లమల్ల రంజిత్ ఒక వినూత్న ప్రయోగంతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ కొరత, పెరిగిన ఖర్చులు… ఇవి సాధారణ హోటళ్లను ఇబ్బందుల్లోకి నెడుతున్నా, రంజిత్ మాత్రం దానికి ఒక తెలివైన మార్గం కనుగొన్నారు.
ఇనుప డ్రమ్ములను జాగ్రత్తగా మోడిఫై చేసి వాటిని శక్తివంతమైన పోయిలు గా మార్చి, కట్టెలను ఉపయోగిస్తూ తన హోటల్ కస్టమర్లకు నిరంతరంగా రుచికరమైన వంటకాలు అందిస్తున్నారు. వంట సువాసనలు గాలి తాకిడిలో తేలుతూ చౌదరి హోటల్ వైపు నకి కస్టమర్లను లాక్కొచ్చేలా మారింది.
ఈ వినూత్న ఆలోచన గురించి మాట్లాడిన నల్ల మల్ల రంజిత్,
“గ్యాస్ సమస్య వచ్చినప్పటి నుండి ఇలా ట్రై చేశాం… చాలా బాగా పనిచేస్తోంది. ఖర్చు తగ్గింది, వంట వేగం పెరిగింది, రుచి మాత్రం మరింత బావుంది” అని పున్నమి జిల్లా ఇంచార్జి పువ్వాడ నాగేంద్ర కుమార్ కి తెలిపారు.
రంజిత్ సరికొత్త ఆలోచనను చూసి, పరిసర ప్రాంతాల హోటల్ యజమాన్లు కూడ



