గోపవరంలో ఉచిత పశు వైద్య శిబిరం!
ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామములో శనివారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రొద్దుటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. AMC అధ్యక్షురాలు వద్ది సురేఖ, కార్యదర్శి రత్నరాజు మాజీ MPP నంద్యాల రాఘవ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ పశు వైద్యశాల డాక్టర్లు, సిబ్బంది మూగ జీవాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన మందులను పంపిణీ చేశారు.


