పున్నమి ప్రతినిధి తిరుపతి రూరల్
ఉదయం 9 గంటలకు శ్రీసీతారాముల కల్యాణం
*ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం*
*భక్తాదులు అందరికీ చక్కటి విందు భోజనం*
తిరుపతి నగర శివార్లలోని తుమ్మల గుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద ఈనెల 27 న అంగరంగ వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. శుక్ర వారం ఉదయం 8 గంటలకు ముత్యాల తలంబ్రాలతో గ్రామోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత ఉదయం 9 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఆ తరువాత ఉదయం 11 గంటలకు శ్రీరామ పట్టాభిషేకంను కన్నుల పండువుగా నిర్వహిస్తారు.
*చక్కటి విందు భోజనం*
ఆలయం వద్ద జరిగే శ్రీరామ నవమి మహోత్సవాల్లో పాల్గొనే భక్తాదులు అందరికీ చక్కటి విందు భోజనం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఏర్పాటు చేశారు. కావున భక్తులు అందరూ స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం, పట్టాభిషేకంలో పాల్గొనాలని విజ్ఞప్తి.



