శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 115 మంది సాధక్లు బాధ్యతలు స్వీకరించి, నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సాధక్లు గ్రామాల వారీగా తిరుగుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ భావజాలాలను ప్రజలకు వివరించడమే కాకుండా, ఉద్యమి సభ్యత్వం ద్వారా లభించే భద్రత, భరోసా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఒక సభ్యత్వం ద్వారా అనేక వేల సభ్యత్వాలు నమోదు చేయిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసమేనని, ఇతరుల కోసం కాదని స్పష్టం చేశారు. సాధక్గా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక బలమైన నాయకుడిగా ఎదగాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. పేట బ్రదర్స్ మిత్రబృందం ప్రతిపాదన మేరకు, ప్రతి సాధక్ను భవిష్యత్లో శక్తివంతమైన నాయకుడిగా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

జనసేన సభ్యత్వ నమోదు వేగవంతం – 115 మంది సాధక్లతో గ్రామాల దాకా విస్తరణ
శ్రీకాళహస్తి, మార్చి 21 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 115 మంది సాధక్లు బాధ్యతలు స్వీకరించి, నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సాధక్లు గ్రామాల వారీగా తిరుగుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ భావజాలాలను ప్రజలకు వివరించడమే కాకుండా, ఉద్యమి సభ్యత్వం ద్వారా లభించే భద్రత, భరోసా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఒక సభ్యత్వం ద్వారా అనేక వేల సభ్యత్వాలు నమోదు చేయిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మాట్లాడుతూ, జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తిగా పవన్ కళ్యాణ్ ఆశయాల సాధన కోసమేనని, ఇతరుల కోసం కాదని స్పష్టం చేశారు. సాధక్గా బాధ్యతలు తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక బలమైన నాయకుడిగా ఎదగాలనే సంకల్పంతో పనిచేస్తున్నారని తెలిపారు. పేట బ్రదర్స్ మిత్రబృందం ప్రతిపాదన మేరకు, ప్రతి సాధక్ను భవిష్యత్లో శక్తివంతమైన నాయకుడిగా తీర్చిదిద్దే దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

