Wednesday, 18 March 2026
  • Home  
  • ముదిరాజ్ సోదరులందరు రాజకీయాలకు అతీతంగా కలసుండాలి- సంఘ జిల్లా అధ్యక్షులు
- తిరుపతి

ముదిరాజ్ సోదరులందరు రాజకీయాలకు అతీతంగా కలసుండాలి- సంఘ జిల్లా అధ్యక్షులు

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక బహుదూర్పేటలో వున్న నలగంగమ్మ దేవాలయంలో బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంఘ జిల్లా అధ్యక్షులు వై.వి. రమణయ్య ముదిరాజ్ చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ….స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ముదిరాజ్ సంఘానికి ప్రత్యేక గుర్తింపు లేదా కార్పొరేషన్ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ముదిరాజ్ వర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇరవై వేల మంది ముదిరాజ్‌లు ఉన్నారని ప్రతి ముదిరాజ్ సోదరుడు రాజకీయాలకు అతీతంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ముదిరాజ్ సంఘానికి ప్రత్యేక భవనం నిర్మించుకోవాలని, అందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా, ముదిరాజ్ సంఘ ఐక్యతకు ఇది నాంది పలికిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 18 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక బహుదూర్పేటలో వున్న నలగంగమ్మ దేవాలయంలో బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజ్ సంఘం యొక్క డైరీ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సంఘ జిల్లా అధ్యక్షులు వై.వి. రమణయ్య ముదిరాజ్ చేతుల మీదగా ప్రారంభించారు. ఈ సందర్బంగా సంఘ అధ్యక్షులు మాట్లాడుతూ….స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ముదిరాజ్ సంఘానికి ప్రత్యేక గుర్తింపు లేదా కార్పొరేషన్ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా ముదిరాజ్ వర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇరవై వేల మంది ముదిరాజ్‌లు ఉన్నారని ప్రతి ముదిరాజ్ సోదరుడు రాజకీయాలకు అతీతంగా ఐక్యతతో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో ముదిరాజ్ సంఘానికి ప్రత్యేక భవనం నిర్మించుకోవాలని, అందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగియగా, ముదిరాజ్ సంఘ ఐక్యతకు ఇది నాంది పలికిందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.