ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి( పున్నమి ప్రతినిధి).మనుబోలు.మండలంలోని ఆంధ్ర విలాస్ హోటల్ సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన రఘురామయ్య (60) మనుబోలులోని బంధువులను పలకరించి తిరుగు ప్రయాణంలో ఉండగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోయాడు. ఎక్కువగా మద్యం సేవించడంతో గొంతు ఆరిపోయి మృతి చెందినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మనుబోలులో వ్యక్తి మృతి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి( పున్నమి ప్రతినిధి).మనుబోలు.మండలంలోని ఆంధ్ర విలాస్ హోటల్ సమీపంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. తోటపల్లి గూడూరు మండలం పాపిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన రఘురామయ్య (60) మనుబోలులోని బంధువులను పలకరించి తిరుగు ప్రయాణంలో ఉండగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోయాడు. ఎక్కువగా మద్యం సేవించడంతో గొంతు ఆరిపోయి మృతి చెందినట్లు బంధువులు అనుమానిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

