ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని వైయస్సార్ కూడలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన జనరల్ సెక్రటరీ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

మనుబోలులో వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘన వేడుకలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండల కేంద్రంలోని వైయస్సార్ కూడలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన జనరల్ సెక్రటరీ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమమే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

