ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలోని అంబేద్కర్ కాలనీ వాసులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అంబేద్కర్ కాలనీలో శ్రీ కోదండ రామస్వామి ఆలయం మంజూరు చేయించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గారికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, మండల యూనిట్ ఇంచార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టంగుటూరు పెంచలయ్య, ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి గారి సహకారంతో గ్రామంలో ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

అంబేద్కర్ కాలనీలో కోదండరామ స్వామి ఆలయం మంజూరు మంత్రి అనఁ రామనారాయణ రెడ్డి కీ సన్మానo
ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామంలోని అంబేద్కర్ కాలనీ వాసులు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అంబేద్కర్ కాలనీలో శ్రీ కోదండ రామస్వామి ఆలయం మంజూరు చేయించినందుకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి గారికి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఆత్మకూరు మండల టీడీపీ అధ్యక్షులు సుంకర పెంచల చౌదరి, మండల యూనిట్ ఇంచార్జి కొండ్రెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ టంగుటూరు పెంచలయ్య, ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మంత్రి గారి సహకారంతో గ్రామంలో ఆధ్యాత్మిక అభివృద్ధి జరుగుతుందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.

