రాపూరు అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాపూరు – చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి వద్ద ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి (24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం. సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బాలు లభ్యమవ్వగా, ముందుగా విషం తాగి తర్వాత ఉరివేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. పంగిలి గ్రామస్తుల సమాచారంతో రాపూర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రాపూర్ ఘాట్ రోడ్డులో ప్రేమ జంట ఆత్మహత్య సోషల్ మీడియా పరిచయం ప్రేమగా మారి విషాదాంతం
రాపూరు అటవీ ప్రాంతంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాపూరు – చిట్వేల్ ఘాట్ రోడ్డులోని 7వ మైలు రాయి వద్ద ప్రేమికుల జంట ఆత్మహత్యకు పాల్పడింది. ముత్తుకూరుకు చెందిన ఆలపాక ప్రసన్న (25), చిట్టమూరుకు చెందిన యాకసిరి సావిత్రి (24) ఒకే చెట్టుకు చున్నీలతో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వీరిద్దరూ ప్రేమలో పడ్డారని సమాచారం. సావిత్రికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలంలో పురుగుల మందు డబ్బాలు లభ్యమవ్వగా, ముందుగా విషం తాగి తర్వాత ఉరివేసుకున్నట్టు అనుమానిస్తున్నారు. పంగిలి గ్రామస్తుల సమాచారంతో రాపూర్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

