ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన అల్లుడికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో దుబాయ్లోనే ఉండిపోవాల్సి వచ్చినట్లు సమాచారం. కుటుంబ సభ్యుడి అత్యవసర ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఆయన గత నెల 23వ తేదీ నుంచి దుబాయ్లోనే కొనసాగుతున్నారు.
అల్లుడి చికిత్సపై వైద్యులతో సమీక్షిస్తూ, కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి అక్కడే ఉన్నారు. ఇదిలా ఉండగా, ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం కారణంగా విమానాల రాకపోకలపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఆయన తిరుగు ప్రయాణంపై స్పష్టత రాలేదు.


