ఖమ్మం మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
వరంగల్: హోలీ పర్వదినాన్ని పురస్కరించుకుని కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, వరంగల్ జిల్లా బీజేపీ ఇంచార్జి కొండపల్లి శ్రీధర్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ స్నేహభావం, ఐక్యత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. సమాజంలో భేదాభిప్రాయాలను పక్కనపెట్టి పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరూ సురక్షితంగా, ఆనందంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని, యువత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు.



