Friday, 20 February 2026
  • Home  
  • ఇన్‌స్టాలో పరిచయం
- పల్నాడు

ఇన్‌స్టాలో పరిచయం

*lసోషల్ మీడియా మాయలో వివాహిత..* *ధనవంతుడని నమ్మి వెళ్లి షాక్ తిన్న ఘటన *ఇన్‌స్టాలో పరిచయం.. ఏపీ చేరగా బయటపడ్డ అసలు నిజం* సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తున్నాయో మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ఓ వివాహితను తన కుటుంబం నుంచి దూరం చేసి, చివరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. జార్ఖండ్‌కు చెందిన 30 ఏళ్ల వివాహితకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట చాట్‌గా ప్రారంభమైన ఈ పరిచయం క్రమంగా ఆడియో, వీడియో కాల్స్ వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ధనవంతుడిగా, అనుభవం కలిగిన వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మేసింది. ఆ నమ్మకంతోనే భర్త, ముగ్గురు చిన్నారులను వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఏపీకి చేరుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆ వ్యక్తిని కలిసింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. తాను ధనవంతుడినని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తాను మోసపోయానని గ్రహించిన మహిళ తీవ్ర నిరాశకు లోనైంది. ఇదే సమయంలో ఆమె గల్లంతైన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పోలీసుల సహకారంతో మహిళను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది. ఈ ఘటనలో విశేషం ఏమిటంటే, భార్య తప్పుదారి పట్టినా భర్త పెద్ద మనసుతో ఆమెను తిరిగి అంగీకరించడం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది. కానీ అదే సమయంలో అపరిచితులతో ఏర్పడే సంబంధాలు ప్రమాదకరంగా మారే అవకాశముంది. అందుకే సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తత అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

*lసోషల్ మీడియా మాయలో వివాహిత..* *ధనవంతుడని నమ్మి వెళ్లి షాక్ తిన్న ఘటన

*ఇన్‌స్టాలో పరిచయం.. ఏపీ చేరగా బయటపడ్డ అసలు నిజం*

సోషల్ మీడియా పరిచయాలు ఎంతటి ప్రమాదాలకు దారి తీస్తున్నాయో మరోసారి ఈ ఘటన స్పష్టం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం ఓ వివాహితను తన కుటుంబం నుంచి దూరం చేసి, చివరికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.

జార్ఖండ్‌కు చెందిన 30 ఏళ్ల వివాహితకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మొదట చాట్‌గా ప్రారంభమైన ఈ పరిచయం క్రమంగా ఆడియో, వీడియో కాల్స్ వరకు వెళ్లింది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. తనను ధనవంతుడిగా, అనుభవం కలిగిన వ్యాపారవేత్తగా పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి మాటలను ఆమె పూర్తిగా నమ్మేసింది.

ఆ నమ్మకంతోనే భర్త, ముగ్గురు చిన్నారులను వదిలి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఏపీకి చేరుకుని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆ వ్యక్తిని కలిసింది. అయితే అక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. తాను ధనవంతుడినని చెప్పుకున్న వ్యక్తి వాస్తవానికి దినసరి కూలీగా పనిచేస్తున్నాడని తెలిసి ఆమె షాక్‌కు గురైంది.

తాను మోసపోయానని గ్రహించిన మహిళ తీవ్ర నిరాశకు లోనైంది. ఇదే సమయంలో ఆమె గల్లంతైన విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఫోన్ సిగ్నల్, సోషల్ మీడియా వివరాల ఆధారంగా ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించారు. పోలీసుల సహకారంతో మహిళను సురక్షితంగా స్వగ్రామానికి తీసుకువచ్చారు.

తల్లిదండ్రులు, బంధువులు కలిసి ఆమెకు నచ్చజెప్పడంతో చివరకు తిరిగి తన కుటుంబం వద్దకు చేరింది. ఈ ఘటనలో విశేషం ఏమిటంటే, భార్య తప్పుదారి పట్టినా భర్త పెద్ద మనసుతో ఆమెను తిరిగి అంగీకరించడం. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

టెక్నాలజీ దూరాలను దగ్గర చేస్తుంది. కానీ అదే సమయంలో అపరిచితులతో ఏర్పడే సంబంధాలు ప్రమాదకరంగా మారే అవకాశముంది. అందుకే సోషల్ మీడియా వాడకంలో అప్రమత్తత అవసరమని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.