శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో సమస్త సభ్యులు మహిళలు పాల్గొని మానవహారం నిర్వహించి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని నిరసన చేపట్టి మహిళలను గౌరవించే సమాజం నెలకొనాలని మహిళలకు పూర్తిగా రక్షణ ఉండాలని పలువురు మహిళలు ఈ సందర్భంగా నినాదాలు చస్తూ బాలిక తల్లికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. మదనపల్లిలో జరిగిన ఏడేళ్ల చిన్నారి పై గంజాయి సేవించిన మృగాడు ఎదురింటిలో నివాసముండే బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి వాడి ఇంటిలోకి తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారం చేసి నీటి డ్రామ్ములో ముంచి కిరాతకముగా హత్య చేసిన మానవ రూపంలో ఉన్న మృగం అటువంటి మృగాలు పట్ల ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని తల్లి,దండ్రులు తమ పిల్లలను పెంచేటప్పుడు ముఖ్యంగా మగ పిల్లలకు మహిళలను గౌరవించాలని పరాయి మహిళలకు తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించే సంస్కారము నేర్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ కుమార్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు ఎంజి బాలాజీ, సంస్థ సభ్యులు కోలా సంగీతారావు, అనిల్ కుమార్, ముని చంద్ర నాయుడు, చంద్రారెడ్డి, వరలక్ష్మి, చైతన్య మల్లికార్జున్ యాదవ్, నందిని, సుభద్ర, పుష్పవల్లి తదితరులు పాల్గొన్నారు.

బాలికలపై జరుగుతున్నఅత్యాచార దాడులు నశించాలి- కోలా వెంకటేశ్వరరావు
శ్రీకాళహస్తి పట్టణంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో సమస్త సభ్యులు మహిళలు పాల్గొని మానవహారం నిర్వహించి ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసిన కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని నిరసన చేపట్టి మహిళలను గౌరవించే సమాజం నెలకొనాలని మహిళలకు పూర్తిగా రక్షణ ఉండాలని పలువురు మహిళలు ఈ సందర్భంగా నినాదాలు చస్తూ బాలిక తల్లికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ…. మదనపల్లిలో జరిగిన ఏడేళ్ల చిన్నారి పై గంజాయి సేవించిన మృగాడు ఎదురింటిలో నివాసముండే బాలికను చాక్లెట్ ఇస్తానని చెప్పి వాడి ఇంటిలోకి తీసుకెళ్లి అమానుషంగా అత్యాచారం చేసి నీటి డ్రామ్ములో ముంచి కిరాతకముగా హత్య చేసిన మానవ రూపంలో ఉన్న మృగం అటువంటి మృగాలు పట్ల ప్రభుత్వాలు కఠినంగా శిక్షించాలని తల్లి,దండ్రులు తమ పిల్లలను పెంచేటప్పుడు ముఖ్యంగా మగ పిల్లలకు మహిళలను గౌరవించాలని పరాయి మహిళలకు తల్లిగా, చెల్లిగా, అక్కగా భావించే సంస్కారము నేర్పించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోహన్ కుమార్ సిటిజన్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు ఎంజి బాలాజీ, సంస్థ సభ్యులు కోలా సంగీతారావు, అనిల్ కుమార్, ముని చంద్ర నాయుడు, చంద్రారెడ్డి, వరలక్ష్మి, చైతన్య మల్లికార్జున్ యాదవ్, నందిని, సుభద్ర, పుష్పవల్లి తదితరులు పాల్గొన్నారు.

