Tuesday, 10 February 2026
  • Home  
  • దేవాంగుల మహాపందిరి పనులకు శ్రీకారం చుట్టిన డి.వై.యస్.పి నరసింహమూర్తి
- తిరుపతి

దేవాంగుల మహాపందిరి పనులకు శ్రీకారం చుట్టిన డి.వై.యస్.పి నరసింహమూర్తి

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తీశ్వర స్వామి, లోకపావని, జ్ఞానప్రసూనాంబ సమేత వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నాడు దేవాంగుల వాహన మండపం వద్ద నిర్మించ తలపెట్టిన హాపందిరి నిర్మాణ పనులను శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డి.వై.యస్.పి. నరసింహమూర్తి కొబ్బరికాయ కొట్టి వైభవంగా ప్రారంభించారు. పోలీసు అధికారుల ఉదారతకు, వారు అందిస్తున్న సహకారానికి దేవాంగుల ప్రతినిధులు చల్లా జయరామయ్య, పులి రాధాకృష్ణ, కన్నా వెంకటేశ్వర్లు, ఇతర ప్రముఖులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏటా ఈ మహాపందిరిని నిర్మిస్తున్నామని, ఈ ఏడాది కూడా అధికారులు, భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని వారు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్న దేవాంగుల కమిటీని అధికారులు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వన్ టౌన్, టూ టౌన్, రూరల్, తొట్టంబేడు సర్కిల్ ఇన్‌స్పెక్టరులు, సబ్ ఇన్‌స్పెక్టరులు, దేవాంగుల సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 09: శ్రీకాళహస్తీశ్వర స్వామి, లోకపావని, జ్ఞానప్రసూనాంబ సమేత వార్ల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం నాడు దేవాంగుల వాహన మండపం వద్ద నిర్మించ తలపెట్టిన హాపందిరి నిర్మాణ పనులను శ్రీకాళహస్తి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి డి.వై.యస్.పి. నరసింహమూర్తి కొబ్బరికాయ కొట్టి వైభవంగా ప్రారంభించారు. పోలీసు అధికారుల ఉదారతకు, వారు అందిస్తున్న సహకారానికి దేవాంగుల ప్రతినిధులు చల్లా జయరామయ్య, పులి రాధాకృష్ణ, కన్నా వెంకటేశ్వర్లు, ఇతర ప్రముఖులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి ఏటా ఈ మహాపందిరిని నిర్మిస్తున్నామని, ఈ ఏడాది కూడా అధికారులు, భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేస్తామని వారు పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్న దేవాంగుల కమిటీని అధికారులు ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి వన్ టౌన్, టూ టౌన్, రూరల్, తొట్టంబేడు సర్కిల్ ఇన్‌స్పెక్టరులు, సబ్ ఇన్‌స్పెక్టరులు, దేవాంగుల సామాజిక వర్గానికి చెందిన పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.