Wednesday, 11 February 2026
  • Home  
  • యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ వ్యవహారం
- తిరుపతి

యువకుడి నిండు ప్రాణాన్ని బలిగొన్న ప్రేమ వ్యవహారం

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: పెళ్లకూరు మండలం, కానూరు గ్రామానికి చెందిన బత్తల చందు (23) అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కానూరు గ్రామానికి చెందిన బత్తల చందు, గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ క్రమంలోనే చందు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ కుమారుడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని, దీని వెనుక ఉన్న అసలు నిజాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యం చూపరులను కలిచివేసింది. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. చందు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపి, బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 09: పెళ్లకూరు మండలం, కానూరు గ్రామానికి చెందిన బత్తల చందు (23) అనే యువకుడు ప్రేమ వ్యవహారంలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మృతుని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కానూరు గ్రామానికి చెందిన బత్తల చందు, గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ క్రమంలోనే చందు మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ కుమారుడి మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని, దీని వెనుక ఉన్న అసలు నిజాలు బయటపెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న దృశ్యం చూపరులను కలిచివేసింది. ఈ ఘటనపై మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేశారు. చందు మృతికి గల కారణాలపై లోతైన విచారణ జరిపి, బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.