ఫిబ్రవరి 1@ నెల్లూరు పట్టణం
ఆదివారం సాయంత్రం నెల్లూరు పట్టణంలోని టౌన్ హాల్లో శాస్త్రీయ సంగీత రంగంలో విజయ వంతంగా దూసుకుపోతున్న ప్రముఖ కర్ణాటక శాస్త్రీయ సంగీత విదుషీమణులు అయిన సర్వేపల్లి సిస్టర్స్ (డాక్టర్ శ్రేయ, డాక్టర్ రాజలక్ష్మి) కి కళాంజలి ఆత్మీయ పురస్కారాన్ని ప్రధానం చేశారు. సంగీత విభావరి మరియు గురుకృప కళాక్షేత్రం అధినేత్రి సురభి గాయత్రి శిష్య బృందంచే ‘తాండవ నృత్య ప్రదర్శన’ తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నెల్లూరు పుర ప్రముఖులు శ్రేయోభిలాషులు స్నేహితులు పాల్గొని ప్రసంగించారు. ఒక రంగంలోనే రాణించడం కష్టతరమైన పరిస్థితులలో ఉన్నత విద్యాభ్యాసమైనటువంటి డాక్టర్స్ కోర్సు పూర్తి చేసి డాక్టర్స్ గా ఉంటూ శాస్త్రీయ సంగీతంలో రాణించడం చాలా గొప్ప విషయమని, ఇటీవల అఖండ-2 చలన చిత్రంలో రెండు పాటలు పాడి మెప్పించి అలరించిన విషయం అందరికీ సుపరిచితమే అని, ప్రతిభామణులు అయిన బిడ్డలను కన్న తల్లిదండ్రులు డాక్టర్ అజయ్ కుమార్ దంపతులు
ధన్యులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాంజలి గౌరవాధ్యక్షులు వీరిశెట్టి హజరత్బాబు, కళాంజలి వ్యవస్థాపకులు అనంత్, తుంగా శివప్రభాత్రెడ్డి, డా. ఎన్.సత్యనారాయణ, వాకాటి విజయకుమార్ రెడ్డి, దొడ్ల భరత్కుమారెడ్డి, డా॥ కే. కృష్ణకిషోర్, డా॥ ఓ.గోపాలకృష్ణ, క్లాసిక్ గ్రాఫిక్స్ పి.విష్ణువర్ధన్రెడ్డి, బెనర్జీ, పాడుతా తీయగా గాయని గాయత్రి, వేదాంభికా నాయుడు, శ్రీకృతి, అభినవ ఘంటసాల కృష్ణయ్య, అభినవ జేసుదాసు మల్లిఖార్జున్ రెడ్డి, డాక్టర్ బద్రి పీర్ కుమార్, భాగ్యవతి తదితర ఇతర సంగీత అభిమానులు పాల్గొన్నారు.



