ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి)
కేంద్ర హోమ్ సహాయక శాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలు, అలాగే పార్టీ సంస్థాగత అంశాలు గురించి కేంద్ర మంత్రికి వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.
ఈ భేటీలో ఖమ్మం 53వ డివిజన్ వాసి, తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ పురాణ ప్రవచన కర్త డాక్టర్ మామిళ్ళపల్లి కోటచార్యులు గారు, ఆయన సతీమణి శ్రీమతి మామిళ్ళపల్లి శివపార్వతి, బీజేపీ యువనేతలు రాజేష్, వెంకట్, మూర్తి, మధు తదితరులు పాల్గొన్నారు.



