గోరంట్ల జనవరి18 : శ్రీ సత్య సాయి జిల్లా మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం విశ్వకవి యోగివేమన జన్మదినం సందర్భంగా ఆత్మీయ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నుండి డాక్టర్ బద్రి పీర్ కుమార్ పాల్గొని చేసిన ‘నీతి నిలయ సమాజాన యోగి వేమన’ అను కవితా పఠనం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పీర్ కుమార్ ని మెమెంటో, ప్రశంసాపత్రం, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రచయితలు హరినాథ్ రెడ్డి, మాధవరాజు సాహితీ సాంస్కృతిక వేదిక నిర్వాహకులు జిఎం సురేష్, రాజారెడ్డి, హెచ్ఎం సుధాకర్రెడ్డి, దేవరాజు స్వామి, జగదీశ్వర్, సోముశేఖర్, భక్తవత్సలం, దామోదర్రెడ్డి, షమీవుల్లా, డాక్టర్ అన్వర్ బాషా, కొండాపురం విజయశ్రీ, జయరామిరెడ్డి తదితరులు పాల్గొని పీర్ కుమార్ ని అభినందించారు.

ఆకట్టుకున్న కవిత్వ పఠనం
గోరంట్ల జనవరి18 : శ్రీ సత్య సాయి జిల్లా మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం విశ్వకవి యోగివేమన జన్మదినం సందర్భంగా ఆత్మీయ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నుండి డాక్టర్ బద్రి పీర్ కుమార్ పాల్గొని చేసిన ‘నీతి నిలయ సమాజాన యోగి వేమన’ అను కవితా పఠనం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పీర్ కుమార్ ని మెమెంటో, ప్రశంసాపత్రం, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రచయితలు హరినాథ్ రెడ్డి, మాధవరాజు సాహితీ సాంస్కృతిక వేదిక నిర్వాహకులు జిఎం సురేష్, రాజారెడ్డి, హెచ్ఎం సుధాకర్రెడ్డి, దేవరాజు స్వామి, జగదీశ్వర్, సోముశేఖర్, భక్తవత్సలం, దామోదర్రెడ్డి, షమీవుల్లా, డాక్టర్ అన్వర్ బాషా, కొండాపురం విజయశ్రీ, జయరామిరెడ్డి తదితరులు పాల్గొని పీర్ కుమార్ ని అభినందించారు.

