జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 100 వినతులు.
– జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్.
*విశాఖపట్నం డిసెంబర్ 29పున్నమి ప్రతినిధి *: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 100 వినతులు వచ్చాయని జివిఎంసి కమిషనర్ కేతన్ గార్గ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం పాత సమావేశ మందిరం లో అదనపు కమిషనర్లు డి.వి.రమణమూర్తి, ఎస్ ఎస్ వర్మ లతో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 100 అర్జీలు / ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా భీమిలి జోన్ కు 06, మధురవాడ జోన్ కు 16, ఈస్ట్ జోన్ కు 15, వెస్ట్ జోన్ కు 07, నార్ట్ జోనుకు 06, సౌత్ జోన్ కు 12, పెందుర్తి జోన్ కు 07, అగనంపూడి జోన్ కు 02, గాజువాక జోన్ కు 07, అనకాపల్లి జోన్ కు 01, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 21 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 14, రెవెన్యూ విభాగమునకు 11, ప్రజారోగ్య విభాగమునకు 06, పట్టణ ప్రణాళిక విభాగమునకు 43, ఇంజినీరింగు విభాగమునకు 18, మొక్కల విభాగమునకు 03, యుసిడి విభాగమునకు 05 కలిపి మొత్తంగా 100 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
అనంతరం కమిషనరు మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను, జోనల్ కమీషనర్లను కమిషనర్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన ఇంజనీర్ సత్యనారాయణ రాజు, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, సిసిపి ఏ.ప్రభాకర రావు, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, డిడిహెచ్ ఎమ్.దామోదరరావు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, కార్యదర్శి బివి రమణ ,స్పోర్ట్స్ డైరెక్టర్ ఇ.ఎ.రాజు, పర్యవేక్షక ఇంజనీర్లు, సిపి, డిసీపీ లు, ఏసీపీ లు, కార్యనిర్వాహక ఇంజినీర్లు,బయాలజిస్ట్, తదితరులు పాల్గొన్నారు.


