మహిళను Instagram మరియు WhatsApp వేదికగా చేసుకొని వేధిస్తున్న ముద్దాయిని పట్టుకున్న విశాఖపట్నం సిటీ పోలీస్
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి*
విశాఖపట్నం పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్., కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ గారి ఆదేశాల మేరకు, సైబర్ క్రైమ్ పోలీసు, విశాఖపట్నం సిటి వారు, Instagram లో పరిచయం పెంచుకొని, పర్సనల్ ఫొటోస్ ని తీసుకొని తరువాత డబ్బులకు ఆశపడి ఫొటోస్ మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా పోస్ట్ చేస్తానని వివిధ రకాల WhatsApp మరియు Instagram వేదికగా వేధిస్తున్న ముద్దాయిపై కేసు నమోదు చేసి, సాంకేతిక సహాయంతో గుర్తించి, రిమాండ్ కి పంపించిన సైబర్ క్రైమ్ పోలీసులు
కేసు వివరాలోకి వెళితే:
నగరానికి చెందిన ఒక మహిళకు instagram ద్వారా పరిచయమైన ముద్దాయి ఆమెను ప్రేమిస్తున్నానని, NEET seat ఇప్పిస్తానని పరిచయం పెంచుకుని సాధారణ ఫోటోలను సేకరించి, NEET seat కావాలంటే 30 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పి, దానికి నిరాకరించినందుకు, గతంలో సేకరించిన సాధారణ ఫోటోలను న్యూడ్ గా morph చేసి దొంగతనం చేసినసెల్ ఫోన్లు మరియు SIM Card లను ఉపయోగించి create చేసిన whatsapp అకౌంట్స్ నుండి పిర్యాదికి పంపించి, డబ్బు కోసం బెదిరింపు మెసేజెస్ చేయడంతో అవి చూసి భయానికి లోనైన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించిన పోలీసులు బాధితురాలికి instagram ద్వారా పరిచయం అయిన వ్యక్తి డబ్బు కోసం వేదింపులకు పాల్పడినట్లు, గుర్తించి సదరువ్యక్తి గతంలో కూడా ఇలాంటి నేరానికి పాల్పడి నగరానికి చెందిన ఒక మహిళ వద్ద నుండి 3,50,000 రూపాయలు మోసగించినట్లు దర్యాప్తులో బయటపడటంతో, దర్యాప్తు ప్రక్రియలో ముద్దాయి గుంటూరు జిల్లా, చెందిన Madinapati Nagulmeera నే వ్యక్తి గా గుర్తించారు. అనంతరం, 29-11-2025 న అతడిని అరెస్ట్ చేసి, చట్టపరమైన ప్రక్రియలతో రిమాండ్ కు తరలించడం జరిగింది.
హెచ్చరిక:
ఎవరికైన అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా టెలిగ్రామ్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ నందు రిక్వెస్ట్ వచ్చిన యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని, అలానే మన సోషల్ మీడియా ఎకౌంటు లను ప్రైవేటు లో పెట్టుకోవాలి అని మరియు అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని వ్యక్తులతో సాంగత్యం పనికి రాదని, తెలియని లింక్ పై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసువారు పేర్కొన్నారు. సైబర్ క్రైమ్ పిర్యాదుల కొరకు సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in లేదా టోల్ ఫ్రీ నెంబర్: 1930 లేదా శ్రీ కమిషనర్ ఆఫ్ పోలీస్: 7995095799 వారికి కాల్ చేసి ఫిర్యాదు చేయగలరని తెలిపారు.

