శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం,
*విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
ఆన్లైన్ టికెట్ల భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ పరిశీలన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఆదేశాలు మరియు గౌరవనీయులైన కమిషనర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సూచనలను అనుసరించి శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దేవస్థానమునందు భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నందు పలు గదులు, దర్శనములు, అభిషేక పూజలు, ఇతర సేవలు, భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్లైన్ ద్వారా వివిధ సేవలు, దర్శనములు, టికెట్లు మరియు ప్రసాదములు బుక్ చేసుకునే భక్తులను ఆలయానికి వచ్చేవారిలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, ప్రత్యేక క్యూ మార్గం ద్వారా దర్శనం చేసుకొనుటకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్ల కొరకు సోమవారం ఆలయ కార్య నిర్వహణ అధికారిణి శ్రీమతి ఎన్. సుజాత , ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణ, సహాయ కార్యనిర్వాహణాధికారి తిరుమలేశ్వరావు, ఏ ఇ రవి రాజు గారి బృందము ఆన్లైన్లో స్వామివారి దర్శనం నకు టికెట్ తీసుకునే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాట్లను పరిశీలించారు. ఆన్లైన్ టికెట్ కలిగిన భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఈ.వో. గారు అధికారులకు సూచించారు.


