ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరై రాజ్యాంగ పీఠిక, పౌరుని ప్రాథమిక విధులు కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న ఘనత భారత రాజ్యాంగం దాని అన్నారు. అంబేద్కర్ సారధ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంగా జీవించడానికి మూల కారణం రాజ్యాంగమే అని అన్నారు. రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిదని అన్నారు. భారత రాజ్యాంగంపై , ప్రభుత్వ చట్టాలు, పథకాలపై మరియు సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సంతోష్, సుదర్శన్, మధు, రాజు, సాయి ప్రసాద్, శ్రీనివాస్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొన్న డాక్టర్ కమలాకర్
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించగా రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరై రాజ్యాంగ పీఠిక, పౌరుని ప్రాథమిక విధులు కరపత్రాన్ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిందన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని నడిపిస్తున్న ఘనత భారత రాజ్యాంగం దాని అన్నారు. అంబేద్కర్ సారధ్యంలో రెండు సంవత్సరాల పదకొండు నెలల 18 రోజులు రాజ్యాంగాన్ని రచించడం జరిగిందన్నారు. దేశ ప్రజలందరూ భిన్నత్వంలో ఏకత్వంగా జీవించడానికి మూల కారణం రాజ్యాంగమే అని అన్నారు. రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి గుండెకాయ లాంటిదని అన్నారు. భారత రాజ్యాంగంపై , ప్రభుత్వ చట్టాలు, పథకాలపై మరియు సమాచార హక్కు చట్టంపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్, సంతోష్, సుదర్శన్, మధు, రాజు, సాయి ప్రసాద్, శ్రీనివాస్, సురేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

