– సన్న వరి రైతుల సమస్యలపై మంత్రి సీతక్క స్పందన: బోనస్ ఇచ్చే ఉద్దేశ్యం ప్రకటింపు
కామారెడ్డి, నవంబర్ 20, (పున్నమి ప్రతినిధి) :
కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర మంత్రి సీతక్కకు రామారెడ్డి మండల రైతులు విజ్ఞప్తి చేశారు. రామారెడ్డి మీదుగా మంత్రి కాన్వాయ్ వెళ్తుండగా స్థానిక రైతులు ఆపి, సన్న వరి రైతుల కు బోనస్ మంజూరు చేయాలంటూ వినతి పత్రం అందజేశారు.రైతుల సమస్యలు విన్న మంత్రి సీత క్క తమ ప్రభుత్వమే రైతు పట్ల అనుకూల దృక్ప థంతో ఉందని పేర్కొంటూ, సన్న వరి పంటకు బోనస్ ఇవ్వడంపై కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల జీవన ప్రమాణాలు మెరుగు పరచడం ప్రభు త్వ ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.తదుపరి మంత్రి నిజామాబాద్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చేరుకుని ఎవరెస్టు శిఖరం అధిరో హించిన మాలవ త్ పూర్ణను పరామర్శించారు. పూర్ణ సాధన పట్ల ఆమె గర్వం వ్యక్తం చేస్తూ, గ్రామీణ ప్రాంత యువత కు ఆమె ప్రేరణగా నిలుస్తున్నారని ప్రశంసించారు.


