విశాఖపట్నం గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని 49వ వార్డులో పారిశుద్ధ్య విభాగానికి చెందిన కార్మికులకు మూడు జతల యూనిఫాం పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ త్రిమూర్తులు, సానిటరీ సూపర్వైజర్ శ్రీనివాసరావు సమన్వయంతో, వార్డు కార్పొరేటర్ & జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకర్రావు చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు యూనిఫాంలు అందజేయడం జరిగింది.
పారిశుద్ధ్య కార్మికుల భద్రత, శుభ్రత, పనితీరును దృష్టిలో ఉంచుకుని జీవీఎంసీ తరఫున ఈ యూనిఫాంలు పంపిణీ చేయబడినట్లు అధికారులు తెలిపారు. మొత్తం మూడు జతల యూనిఫాంలు ప్రతీ కార్మికునికి అందజేసి, వారు తమ విధులు మరింత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించారు
ఈ సందర్భంగా అల్లు శంకర్రావు మాట్లాడుతూ
జీవీఎంసీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని,
వారి యోగక్షేమాల కోసం అవసరమైన యూనిఫాంలతో పాటు
హ్యాండ్ గ్లోవ్స్,
ఫేస్ మాస్క్స్,
గమ్ బూట్లు,
సేఫ్టీ సామగ్రి,
వర్క్ కిట్లు
వంటి ఉపకరణాలు కూడా జీవీఎంసీ నిరంతరం అందిస్తున్నదన్నారు.
అలాగే, కార్మికులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు తనవంతు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
సానిటరీ ఇన్స్పెక్టర్ త్రిమూర్తులు మాట్లాడుతూ
పారిశుద్ధ్య పనులు రోజువారీగా ఎక్కువ శ్రమ మరియు రిస్క్తో కూడుకున్నవని,
కార్మికుల భద్రతను ముందుంచుకుని అవసరమైన సామగ్రిని సమయానికి అందించడం జీవీఎంసీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.
సూపర్వైజర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ
వార్డులో పారిశుద్ధ్య సేవలు మరింత మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నామని,
కార్మికుల అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టుతున్నామని పేర్కొన్నారు.
యూనిఫాంలు అందుకున్న పారిశుద్ధ్య కార్మికులు జీవీఎంసీ, వార్డు కార్పొరేటర్, సంబంధిత అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. పనిసమయంలో యూనిఫాంలు చాలా సహాయపడతాయని, ఇది తమకు కలిగిన గౌరవానికి నిదర్శనమని భావించారు.


