పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నాడు పరిగి నియోజకవర్గం పరిధి పూడూరు మండల కేంద్రంలో పత్తి రైతులు కోసం పూడూరు పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిగి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ తో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షత చూపుతున్నాయని అన్నారు అకాల వర్షాలతో, అననుకూల వాతావరణ పరిస్థితులతో ఇప్పటికే దిగుబడి రాక అతలాకుతలమవుతున్న పత్తి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందిందని. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రాష్ట్రంలో ఏ మార్కెట్లో కూడా అమలు కావడం లేదని. తేమశాతం పేరుతో పత్తి రైతులను వ్యాపారులు, ప్రభుత్వము నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పత్తిని అన్ని మార్కెట్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

* పత్తి రైతుల సమస్యలు తీర్చేదాక బిఆర్ఎస్ పోరాటం ఆగదు.. సబితా ఇంద్రారెడ్డి *
పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 18 : రాష్ట్రవ్యాప్తంగా పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం నాడు పరిగి నియోజకవర్గం పరిధి పూడూరు మండల కేంద్రంలో పత్తి రైతులు కోసం పూడూరు పత్తి కొనుగోలు కేంద్రాన్ని పరిగి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు మెతుకు ఆనంద్ తో కలిసి పరిశీలించిన మాజీ మంత్రి మహేశ్వరం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పత్తి రైతుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివక్షత చూపుతున్నాయని అన్నారు అకాల వర్షాలతో, అననుకూల వాతావరణ పరిస్థితులతో ఇప్పటికే దిగుబడి రాక అతలాకుతలమవుతున్న పత్తి రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందిందని. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర రాష్ట్రంలో ఏ మార్కెట్లో కూడా అమలు కావడం లేదని. తేమశాతం పేరుతో పత్తి రైతులను వ్యాపారులు, ప్రభుత్వము నిలువునా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన పత్తిని అన్ని మార్కెట్లలో తేమ శాతంతో సంబంధం లేకుండా తక్షణమే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

